గోర్ల‌ఖాన్ దొడ్డిలో 25 గొర్రెలు మృతి

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-05 11:19:52  IST  )

దిశ‌, గ‌ట్టు : మండ‌ల ప‌రిధిలోని గోర్ల‌ఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన కురువ తిప్ప‌న్న‌, కురువ వెంక‌ట‌న్న‌, కురువ ఈర‌న్న‌ల‌కు చెందిన దాదాపు 25 గొర్రెలు మేత మేస్తూ అక‌స్మాత్తుగా బుధ‌వారం

గోర్ల‌ఖాన్ దొడ్డిలో  25 గొర్రెలు మృతి
X

దిశ‌, గ‌ట్టు : మండ‌ల ప‌రిధిలోని గోర్ల‌ఖాన్ దొడ్డి గ్రామానికి చెందిన కురువ తిప్ప‌న్న‌, కురువ వెంక‌ట‌న్న‌, కురువ ఈర‌న్న‌ల‌కు చెందిన దాదాపు 25 గొర్రెలు మేత మేస్తూ అక‌స్మాత్తుగా బుధ‌వారం 25 గొర్లు మ‌ర‌ణించాయి. ఈ సంఘ‌ట‌న ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది. మృతి చెందిన గొర్రెల‌ను ప‌శుసంవ‌ర్ధ‌క అధికారి డాక్ట‌ర్ న‌వీన్ చంద్ సంఘ‌ట‌న స్థ‌లాన్ని ప‌రిశీలించారు. విష ఆహారం తిన‌డం వ‌ల్ల‌నే గొర్రెలు మ‌ర‌ణించిన‌ట్టు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌ర‌ణించిన గొర్రెల‌కు పోస్టుమార్టం నిర్వ‌హించిన‌ట్టు అధికారులు తెలిపారు. గ‌తంలో క‌లుషిత ఆహారం తిన‌డం వ‌ల్ల గొర్రెలు మృతి చెందిన సంఘ‌ట‌న న‌మోదు అయ్యాయి . ప్ర‌భుత్వం స్పందించి గొర్రెల కాప‌రుల‌కు ఆర్థిక స‌హాయం అందించాల‌ని కోరారు.

Next Story