- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Maha Dharna : రేపు వికలాంగుల మహా ధర్నా
by Muthe.Rajitha |
వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్(Hyderabad)లో వికలాంగులు మహా ధర్నా నిర్వహించనున్నారు.

X
దిశ, వెబ్ డెస్క్ : వికలాంగుల పెన్షన్(Disability Pension) రూ. 6 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల జాతీయ వేదిక (NPRD) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్(Hyderabad)లో వికలాంగులు మహా ధర్నా నిర్వహించనున్నారు. ఇందిరా పార్క్ వద్ద జరుగనున్న వికలాంగుల మహాధర్నాకు బీఆర్ఎస్(BRS), సీపీఎం(CPM), సీపీఐ(CPI), టీడీపీ(TDP) పార్టీల నాయకులు హాజరు కానున్నట్లు ఎన్పిఆర్డి రాష్ట్ర కార్యదర్శి ఎం.అడివయ్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత 20 రోజుల నుండి రాష్ట్రంలో వికలాంగులు ఉద్యమం చేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ మహా ధర్నాను జయప్రదం చేయాలని ఆయన వికలాంగులకు పిలుపునిచ్చారు.
Next Story






