నేడు కవిత ఈడీ విచారణకు హాజరు కాదు: సోమా భరత్

by Sathputhe Rajesh |   (  Updated:2023-03-16 08:42:42  IST  )

ఈడీ విచారణకు కవిత తరపున హాజరై సమాచారం అందించిన బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ మీడియాతో మాట్లాడారు.

నేడు కవిత ఈడీ విచారణకు హాజరు కాదు: సోమా భరత్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈడీ విచారణకు కవిత తరపున హాజరై సమాచారం అందించిన కవిత ప్రతినిధి, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ మీడియాతో మాట్లాడారు. కవిత తరపున ఈడీకి కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చామన్నారు. మహిళను ఇంట్లోనే ప్రశ్నించాలని, ఆరు గంటలలోపే విచారించాలని నిబంధనలున్నాయని తెలిపారు. 11వ తేదీన విచారణలో ఈ నిబంధనలను ఈడీ ఉల్లంఘించిదన్నారు.

చట్ట ప్రకారం ఇంటివద్ద విచారణ జరగాలని విచారణ సందర్భంగా కవిత ఈడీని కోరారని తెలిపారు. అప్పుడు ఈడీ అంగీకరించకపోయినా చట్టాన్ని కవిత గౌరవించారన్నారు. కవితపై కేంద్రం కక్ష గట్టిందన్నారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారన్నారు. ఈడీ ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని, డేట్ కూడా ఇవ్వలేదన్నారు. మా పిటిషన్ పై సుప్రీం కోర్టు ఇవ్వబోయే నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని సోమ భరత్ అన్నారు. నేడు కవిత ఈడీ విచారణకు హాజరు కాదన్నారు.

Next Story