సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై కుమారి ఆంటీ రియాక్షన్ అదుర్స్..

by Disha Web Desk 12 |
సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంపై కుమారి ఆంటీ రియాక్షన్ అదుర్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ద్వారా తన ఫుడ్ సెంటర్ వైరల్ గా మారడంతో కుమారి అంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది. ఈ క్రమంలో వేలల్లో సోషల్ మీడియా యూజర్స్ ఆంటీ ఫుడ్ తినాలని బంజారాహిల్స్ వస్తుండటంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఆమె ఫుడ్ స్టాల్ ను తొలగించాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కుమారి ఆంటీ కి తమ పని తాము చూసుకుంటామని ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఫుడ్ సెంటర్ ను నిలిపివేస్తున్నామని ఆమెకు తెలిపారు. దీంతో మంగళవారం మొత్తం కుమారి ఆంటీ కి అధికారులు అన్యాయం చేస్తున్నారిని నెటిజన్లు చర్చకు దారి తీశారు.

దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ట్రాఫిక్ అధికారులకు.. సాయి కుమారి ఫుడ్ సెంటర్‌ను తొలగించోద్దని, యాదావిదిగా ఆమె ఫుడ్ సెంటర్ ను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే త్వరలోనే తాను సాయి కుమారి ఫుడ్ సెంటర్‌ని విజిట్ చేస్తానని చెప్పుకొచ్చాడు. సీఎం ఆదేశాలతో కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు పర్మిషన్ ఇచ్చారు. దీనిపై కుమారి ఆంటీ స్పందించారు. స్వయానా సీఎం స్పందించి తనను ఆదుకోవడం, తానే వచ్చి భోజనం చేస్తాననడం చాలా సంతోషంగా ఉందని.. ఆయన రాకకు తాను ఎన్ని జన్మల పుణ్యమో అని.. తన కష్టాలు సీఎం గుర్తించడం చాలా సంతోషంగా ఉందని..చెబుతూ భావోద్వేగానికి లోనయ్యారు.



Next Story

Most Viewed