- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ స్కీం కోసం జట్టు పట్టి కొట్టుకున్న మహిళలు.. కాంగ్రెస్ పై కేటీఆర్ సెటైర్లు
నిజామాబాద్ లోని పోస్టాఫీసుకు వచ్చిన మహిళలు ఒకరిని ఒకరు జుట్టు పట్టి కొట్టుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : నిజామాబాద్ లోని పోస్టాఫీసుకు వచ్చిన మహిళలు ఒకరిని ఒకరు జుట్టు పట్టి కొట్టుకున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలలో ఒకటైన మహాలక్ష్మి పథకం(Mahalaxmi Scheme) కింద ప్రభుత్వం ప్రతి మహిళకు రూ.2500 ఇస్తోందని పుకారు షికారు చేస్తోంది. ఈ క్రమంలోనే నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోస్టాఫీసుకు భారీగా మహిళలు చేరుకున్నారు. అయితే లైన్లో నిలబడే అంశంపై మొదలైన తగాదా చిలికి చిలికి గాలివాన అయ్యి, చివరికి ఒకరిని ఒకరు జుట్లు పట్టుకొని చావబాదుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు.
ఈ గొడవను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట్లో వైరల్ అయింది. కాగా ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. 'నిన్నటి వరకు బస్సుల్లో మహిళలకు గొడవలు పెట్టావు. ఇపుడు మహాలక్ష్మి పథకం పేరిట మభ్యపెట్టి జుట్లు పట్టుకొని కొట్టుకొని చచ్చేలా చేస్తావా రేవంత్..' అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.






