దుబాయ్ జైలు నుంచి విడుదలైన బాధితులకు కేటీఆర్ పరామర్శ

by Disha Web Desk 14 |
దుబాయ్ జైలు నుంచి విడుదలైన బాధితులకు కేటీఆర్ పరామర్శ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ హత్య కేసులో దుబాయ్‌లో దాదాపు 18 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చోరవతో ఒక్కొక్కరుగా వారు ఇండ్లకు చేరుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన 5 గురు వ్యక్తులని కేటీఆర్ పరామర్శించారు.తాజాగా వారి కుటుంబ స‌భ్యుల‌తో ఆప్యాయంగా ముచ్చ‌టించి, బాగోగులు అడిగి తెలుసుకున్నారు.

గ‌ల్ఫ్ జైలు నుంచి విడుద‌ల చేయించినందుకు కేటీఆర్‌కు వారు ఈ సందర్భంగా ధన్య‌వాదాలు తెలిపారు. కేటీఆర్‌ సార్‌ వల్లే తాము విడుదలయ్యామ‌ని, సార్‌కు రుణపడి ఉంటామని గల్ఫ్ భాదితుడు మ‌ల్లేశం చెప్పారు.



Next Story

Most Viewed