KTR: కనకరత్నమ్మ దశదినకర్మలో కేటీఆర్.. అల్లు అర్జున్‌ను ఆప్యాయంగా పలకరింపు

by Ramesh Naini |   (  Updated:2025-09-08 14:47:32  IST  )

కనకరత్నమ్మ దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.

KTR: కనకరత్నమ్మ దశదినకర్మలో కేటీఆర్.. అల్లు అర్జున్‌ను ఆప్యాయంగా పలకరింపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత నటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ (94) ఇటీవల కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇవాళ (సోమవారం) అల్లు అరవింద్ కుటుంబసభ్యులను కనకరత్నమ్మ దశదినకర్మ నిర్వహించారు. ఈ దశదినకర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ మేరకు అల్లు కనకరత్నమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి, అల్లు అరవింద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)ను కేటీఆర్ ఆప్యాయంగా పలకలించి.. కాసేపు మాట్లాడారు. కేటీఆర్‌తో పాటు బీఆర్ఎస్ సీనయర్ నేతలు కూడా ఉన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రామ్‌చరణ్‌తో పాటు ప్రముఖులు పాల్గొని కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు.

Read Also..

అల్లు అర్జున్ ఇంటికి మహేశ్ కుమార్ గౌడ్

Next Story