పేపర్ లీకేజీకి కేటీఆరే కారణమంటూ.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Disha Web Desk 4 |
పేపర్ లీకేజీకి కేటీఆరే కారణమంటూ.. రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఏ పరీక్షలు చూసినా పేపర్ లీకులే అని రేవంత్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగుల సమస్యను కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. కేసీఆర్ అబద్ధం చెప్పినా రెండు సార్లు అవకాశం ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ పైరవీకారులకు ముందే ప్రశ్నాపత్రాలు అందుతున్నాయని ఆరోపించారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో చిన్న చేపలను బలి చేస్తున్నారన్నారు. పరీక్ష పేపర్ లీకేజీకి కేటీఆర్ కారణమని సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి ఎందుకు బర్తరఫ్ చేయరని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ అంశంపై ఈనెల 22న గవర్నర్ ను కలుస్తామన్నారు.

Also Read..

రేవంత్‌రెడ్డి సాక్షిగా మదన్ మోహన్‌కు దక్కని ప్రాధాన్యం


Next Story

Most Viewed