Keshava Rao: ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు(BC Reservations) ఖరారు చేయడానికి డెడికేటెడ్ కమిషన్(Dedicated Commission) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు(K.Kesha Rao) స్వాగతించారు.

Keshava Rao: ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు(BC Reservations) ఖరారు చేయడానికి డెడికేటెడ్ కమిషన్(Dedicated Commission) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు(K.Kesha Rao) స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని కేకే(KK) ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. బీసీలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు. కాగా, తెలంగాణలో బీసీ కులగణనకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టు(High Court) తీర్పునకు అనుగుణంగా ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు రేపటిలోగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం స్పష్టం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు సోమవారం లోపు డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు కానుంది.

Next Story