అది మాత్రం వాస్తవమే కానీ.. గోల్డ్ మైన్స్‌లో పెట్టుబడులపై కిషన్ రెడ్డి అనూహ్య వ్యాఖ్యలు

by Disha Web Desk 2 |
అది మాత్రం వాస్తవమే కానీ.. గోల్డ్ మైన్స్‌లో పెట్టుబడులపై కిషన్ రెడ్డి అనూహ్య వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: 'నా గెలుపును జీర్ణించుకోలేక ప్రత్యర్థులు 2018లో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు' అని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి విలేకర్లతో చిట్ చాట్ చేశారు. ఎన్నికల కమిషన్ ఫిర్యాదును పరిష్కరించకపోవడంతో ఈడీకి అప్పగించారని అన్నారు. తనపై తప్పుడు ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఈడీ హైదరాబాదుకు బదిలీ చేశారని అన్నారు. గోల్డ్ మైన్స్‌లో పెట్టుబడులు అవాస్తవమని కిషన్ రెడ్డి అన్నారు. 2014లో నలుగురు మిత్రులతో కలిసి విదేశాలకు వెళ్లిన మాట వాస్తవమే అని అన్నారు. వెస్టన్ మనీ ట్రాన్స్ఫర్‌లో డబ్బులు తీసుకున్న ఫెమా పరిధిలోకి వస్తుందని విచారణ జరిపారని వివరించారు.


Next Story