ఎన్నికల వేళ సొంత నేతలకు కిషన్ రెడ్డి కీలక పిలుపు

by Disha Web Desk 2 |
Kishan Reddy
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించి.. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక శాతం ఓటింగ్ నమోదు అయ్యేలా పోలింగ్ కేంద్రాలకు తరలించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉగాది పర్వదినం సందర్భంగా ఆయన ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. షడ్రుచుల ద్వారా సుఖ:దుఖాలకు, శాంతికి, సమృద్ధికి, బాధ్యతలకు, హక్కులకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ జీవితాన్ని ముందుకు సాగించాలన్నది ఉగాది సందేశమన్నారు. శ్రీక్రోధి నామ సంవత్సరం అందరి జీవితాల్లోకి సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, సమృద్ధి తీసుకురావాలని అయన భగవంతుణ్ణి వేడుకున్నారు. మన భాషను, సంస్కృతిని, సంప్రదాయాలను తర్వాతి తరాలకు అందించడం.. పండుగలను జరుపుకోవడంలోని అంతరార్థమన్నారు. మన హక్కులను గుర్తుచేస్తూనే.. ప్రకృతిపట్ల, సమాజం పట్ల మన బాధ్యతలను మన పండుగలు గుర్తుచేస్తాయన్నారు. నవ వసంతం సమయంలో జరుపుకునే ఉగాది పండుగ ఇందులో ఓ భాగమన్నారు. మన పూర్వీకులు సూచించినట్లుగా సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనంగా ఈసారి ఉగాది పండుగను జరుకుంటారని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.



Next Story

Most Viewed