Kishan Reddy:పర్యాటకం అభివృద్ధే లక్ష్యంగా జీ-20 సమావేశాలు..

by Disha Web Desk 21 |
Kishan Reddy
X

దిశ,వెబ్‌డెస్క్: పర్యాటకం అభివృద్దే లక్ష్యంగా జీ- 20 సమావేశాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఎక్కువైందని ఆయన అన్నారు. గోవాలో నేటి నుంచి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 21, 22 తేదీల్లో జీ-20 టూరిజం మనిస్టర్స్ కాస్ఫరెన్స్ జరగనుంది. పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటివరకు జరిగిన జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి.. పరస్పర సహకారంపై వర్కింక్ గ్రూప్ ఉమ్మడి అంశాలను ఆమోదించనుంది.

Also Read...

బీజేపీని ఓడించాలంటే అన్ని లౌకిక పార్టీలు ఏకతాటిపైకి రావాలి: డి రాజా

Next Story

Most Viewed