- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kishan Reddy:పర్యాటకం అభివృద్ధే లక్ష్యంగా జీ-20 సమావేశాలు..
పర్యాటకం అభివృద్దే లక్ష్యంగా జీ- 20 సమావేశాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు.

X
దిశ,వెబ్డెస్క్: పర్యాటకం అభివృద్దే లక్ష్యంగా జీ- 20 సమావేశాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. పర్యాటక ప్రాంతాల్లో ప్లాస్టిక్ ఎక్కువైందని ఆయన అన్నారు. గోవాలో నేటి నుంచి జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయి. 2 రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే జూన్ 21, 22 తేదీల్లో జీ-20 టూరిజం మనిస్టర్స్ కాస్ఫరెన్స్ జరగనుంది. పర్యాటక రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటి పరిష్కారాలు అనే అంశాలపై ఈ సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇప్పటివరకు జరిగిన జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల ఫలితాలపై చర్చించి.. పరస్పర సహకారంపై వర్కింక్ గ్రూప్ ఉమ్మడి అంశాలను ఆమోదించనుంది.
Also Read...
బీజేపీని ఓడించాలంటే అన్ని లౌకిక పార్టీలు ఏకతాటిపైకి రావాలి: డి రాజా
Next Story






