ప్రొటెమ్ స్పీకర్‌ ఎంపిక సరిగ్గా లేదు: కిషన్ రెడ్డి

by Disha Web Desk 2 |
ప్రొటెమ్ స్పీకర్‌ ఎంపిక సరిగ్గా లేదు: కిషన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రొటెమ్‌ స్పీకర్‌గా ఉదయం ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ గవర్నర్ తమిళి సై సమక్షంలో రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. ప్రొటెమ్‌ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ప్రమాణం చేయించడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలను తుంగలో తొక్కిందని మండిపడ్డారు. ఎప్పుడైనా సీనియర్ వ్యక్తులను ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. కానీ, ఎమ్ఐఎమ్‌తో కుట్ర పన్ని కాంగ్రెస్ సంప్రదాయాలను పాటించడలేదని అసహనం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ తమ ఎమ్మెల్యేలంతా ఈ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారని తెలిపారు.

Read More: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. బీజేపీ ఎమ్మెల్యేల సంచలన నిర్ణయం


Next Story

Most Viewed