- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అంచనాలు భారీ.. అమల్లో మాత్రం సారీ’.. రాష్ట్ర బడ్జెట్పై కిషన్ రెడ్డి విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రవేశ పెట్టిన బడ్జెట్(Telangana Budget 2025-2026)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) స్పందించారు.

దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రవేశ పెట్టిన బడ్జెట్(Telangana Budget 2025-2026)పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) స్పందించారు. ‘అంచనాలు భారీ.. అమల్లో మాత్రం సారీ’ అనేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇచ్చిన హామీలు అమలు చేయలేమని తెలిసి.. తప్పించుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్లో అన్ని రంగాలను మోసం చేశారని సీరియస్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని మరిచిన బడ్జెట్ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఇచ్చిన గ్యారంటీలు అన్ని అమలు చేసే వరకు తాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమని అన్నారు. ప్రజలకు లబ్ధి జరిగే వరకు వెంటాడుతామని అన్నారు.
కాగా, 2025-26 ఏడాదికి రూ.3,04,965 కోట్లతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు.
మరోవైపు బడ్జెట్లో అధికశాతం.. పంచాయతీరాజ్ శాఖ- రూ.31,605 కోట్లు, వ్యవసాయశాఖ- రూ.24,439 కోట్లు, విద్యాశాఖ- రూ.23,108కోట్లు, ఎస్సీ సంక్షేమం: రూ40,232 కోట్లు, విద్యుత్ రంగం- రూ.21,221 కోట్లు, నీటి పారుదలశాఖ- రూ.23,373 కోట్లు, ఆరు గ్యారంటీలు- రూ.56,084 కోట్లు, మహిళా శిశుసంక్షేమశాఖ- రూ.2,862 కోట్లు, పౌరసరఫరాల శాఖ- రూ.5,734కోట్లు, రైతు భరోసాకు రూ.18వేల కోట్లు, చేయూత పింఛన్లు రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి పథకానికి రూ.4,305 కోట్లు, గృహజ్యోతి- రూ.2,080 కోట్లు కేటాయింపులు చేశారు.






