- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప్పాక బ్రిడ్జి సైడ్వాల్ ధ్వంసం.. పట్టించుకోని అధికారులు
పినపాక మండల పరిధిలోని ఉప్పాక గ్రామానికి వెళ్లే కూడలిలో గల వాగుపై నిర్మించిన బ్రిడ్జి సైడ్వాల్ పూర్తిగా ధ్వంసమైంది.

దిశ, పినపాక: పినపాక మండల పరిధిలోని ఉప్పాక గ్రామానికి వెళ్లే కూడలిలో గల వాగుపై నిర్మించిన బ్రిడ్జి సైడ్వాల్ పూర్తిగా ధ్వంసమైంది. మణుగూరు-ఏటూరునాగారం ప్రధాన రహదారి కావడంతో పాటు ఇది నాలుగు రోడ్ల కూడలి. నిత్యం వందలాది వాహనాలు ఈ మార్గం గుండా రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో వచ్చే వాహనదారులు సైడ్వాల్ లేకపోవడాన్ని గమనించక ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు . ప్రమాదాలను నివారించడానికి వంతెనకు ఇరువైపులా తాత్కాలికంగా ప్రమాద హెచ్చరిక బోర్డులు, రెడ్ రిబ్బన్ లేదా కర్రలతో కంచెను ఏర్పాటు చేయాలి. స్థానిక పంచాయితీ అధికారులు కానీ, రోడ్డు భవనాల శాఖ అధికారులు కాని ఏమి పట్టించుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి ఈ బ్రిడ్జ్ నిలువుటద్దు నిదర్శనం. ఇంకా ఎటువంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.






