- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పలువురు జూనియర్ సివిల్ జడ్జీలు బదిలీ..
దిశ, లీగల్ ఖమ్మం : ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న నేరెళ్ల వెంకట హైమ పూజిత హనుమకొండ మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో అక్కడ పనిచేస్తున్న పి.గోపిక నాగ శ్రావ్య నియమితులయ్యారు. ఖమ్మం ఒకటవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ నూతక్కి శాంతి సోనీ హనుమకొండ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో కొత్తగూడెం మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న కాసరగడ్డ దీప నియమితులయ్యారు. ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ పి .మౌనిక మహబూబాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు. ఖమ్మం మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా వినుకొండ మాధవి నియమితులయ్యారు.
ఆమె ప్రస్తుతం నల్గొండ జిల్లా మిర్యాలగూడ రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి పనిచేస్తున్నారు. మధిర జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న ధీరజ్ కుమార్ షాద్నగర్ కు బదిలీ కాగా సత్తుపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేస్తున్న శ్రావణ స్వాతి హనుమకొండకు బదిలీ అయ్యారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా నియమితులైన ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ఎస్ జగ్జీవన్ కుమార్ కి, అదనపు జిల్లా న్యాయమూర్తి ఉమాదేవిలకు పరిచయ కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటలకు బార్ అసోసియేషన్ హాల్లో నిర్వహించనున్నట్లు అధ్యక్ష కార్యదర్శులు దిరిశాల కృష్ణారావు బసవయ్య ఒక ప్రకటనలో తెలిపారు.