పోలీసులను ఆశ్రయించి ప్రేమజంట.. వారి నుంచి రక్షణ కావాలంటూ

by Web Desk |
పోలీసులను ఆశ్రయించి ప్రేమజంట.. వారి నుంచి రక్షణ కావాలంటూ
X

దిశ, కారేపల్లి : ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట తమకు రక్షణ కావాలంటూ శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. కారేపల్లికి చెందిన చింతల రాజేశ్‌, భూపాలపల్లికి చెందిన ఎజ్జు శ్రేష్ఠలు కారేపల్లిలో బీటెక్‌ను చదువుతున్నారు. అదే సమయంలో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కానీ వీరి కులాలు వేరు కావడంతో వారి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో వారిద్దరూ మహబుబాబాద్‌లో జిల్లా కొరివి వీరభద్రస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కానీ తమకు తమ కుంటుంబాల నుంచి ప్రమాదం ఉందని భావించిన ప్రేమ జంటను తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుంటుంబాల వారిని పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించి పంపారు.

Next Story

Most Viewed