ఇందిరమ్మ రాజ్యం లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది

by Disha Web Desk 15 |
ఇందిరమ్మ రాజ్యం లక్ష్యసాధన దిశగా ప్రభుత్వం పనిచేస్తుంది
X

దిశ, ఖమ్మం రూరల్ ​: ఎన్నికలకు ముందు ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రజలు ఆశించారని ఆ దిశగానే ప్రభుత్వం పనిచేస్తుందని, ఎన్నికల్లో రూరల్​ మండలం తెల్దారుపల్లి నుంచి అత్యధిక మోజార్టీ ఇవ్వడం సంతోషకరమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం రూరల్​ మండలం తెల్దారుపల్లిలో తమ్మినేని క్రిష్ణయ్యకు నివాళ్లుర్పించి గ్రామంలో నిర్మించిన కాంగ్రెస్​ దిమ్మెను మంత్రి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆరు గ్యారంటీల్లో మరో రెండు పథకాలను మరికొద్ది రోజుల్లో అమలు చేస్తామని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత తనదే అన్నారు. రాబోవు రెండు నెలల్లో కూడా పార్లమెంట్​ అభ్యర్థిని అత్యధిక మోజార్టీతో గెలిపించుకుని రాహుల్​గాంధీని ప్రధాని చేయాల్సిన ఆవశ్యకత మనపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ నాయకులు రాయల నాగేశ్వరర్​రావు, రాంరెడ్డి చరణ్​రెడ్డి, తమ్మినేని నవీన్​, కళ్లెం వెంకటరెడ్డి, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్​, జొన్నలగడ్డ రవి, తేజావత్​ పంతులు, వినోద్​, సాయి, సురేష్​, రామయ్య, కేతినేని వేణు తదితరులు ఉన్నారు.

Read More..

పలు అభివృద్ధి పనులకు శ్రీకారం…


Next Story