జిల్లాకు అంటుకోనున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం

by Disha Web Desk 15 |
జిల్లాకు అంటుకోనున్న ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం
X

దిశ, ఖమ్మం సిటీ : రాష్ట్రంలో సంచలనం రేపుతున్న నిందితుడు ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసు ఖమ్మం జిల్లా మాజీ ప్రజాప్రతినిధులకు అంటుకోనుందనే వార్తలు వినపడుతున్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన నేతల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు పోలీసులు నిర్దారించి ముగ్గురు ప్రధాన నిందితులకు జైలు శిక్ష విధించిన విషయం

తెలిసిందే. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు కొందరు ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఇంట్లో సమావేశం అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ప్రణీత్ రావు ఇంట్లో చర్చలు జరిపిన జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరు, వాళ్లు ఈ కేసులో ఎంతవరకు భాగస్వామ్యులు అయ్యారో పోలీసులే తేల్చాల్సి ఉంది.


Next Story

Most Viewed