- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బూర్గంపాడు పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
by Ratna Kumari |
దిశ-బూర్గంపాడు : బూర్గంపాడు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా

X
దిశ-బూర్గంపాడు : బూర్గంపాడు మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ భద్రతా చర్యలు చేపట్టారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో ఓటు హక్కు వినియోగించుకునేలా డీఎస్పీ అధికారులకు, ఓటర్లకు తగిన సలహాలు,సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఓటు వేయడం పూర్తయిన తర్వాత ఓటర్లు ఎవరూ కూడా పోలింగ్ కేంద్రాల సమీపంలో గుమికూడదు. తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ఓటింగ్ ప్రశాంతంగా పూర్తయ్యేలా అందరూ సహకరించాలని సూచించారు. ఈ భద్రతా ఏర్పాట్లలో డీఎస్పీ సతీష్ కుమార్ తోపాటు స్థానిక ఎస్ఐలు మేడ ప్రసాద్, నాగబిక్షం పాల్గొన్నారు.
Next Story






