TS PSCపేపర్ లీక్ కేసులో పంచాయతీ కార్యదర్శి అరెస్ట్

by Disha Web Desk 6 |
TS PSCపేపర్ లీక్ కేసులో పంచాయతీ కార్యదర్శి అరెస్ట్
X

దిశ,కామేపల్లి: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కామేపల్లి మండలం పెద్ద లచ్చ తండాకు చెందిన గ్రామ పంచాయతీ కార్యదర్శి అజ్మీర పృథ్వీరాజ్ సిట్ బృందం శనివారం అరెస్ట్ చేసింది. పృథ్వీరాజ్ కారేపల్లి మండలం చిన్న మటంపల్లి కి చెందిన జూనియర్ పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నాడు. ఇటీవల లీకైన టీఎస్ పీఎస్సీ ఏఈ ప్రశ్న పత్రాన్ని మురళీధర్ అనే వ్యక్తి నుంచి అతను రూ.2 లక్షలకు కొన్నట్లు దర్యాప్తులో తేలింది. సిట్ పోలీసులు శనివారం తెల్లవారుజామున అతడిని తన ఇంట్లో అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలించారు.



Next Story

Most Viewed