నామినేషన్ పత్రాలకు పూజ చేయించిన ఎమ్మెల్యే దంపతులు..

by Disha Web Desk 20 |
నామినేషన్ పత్రాలకు పూజ చేయించిన ఎమ్మెల్యే దంపతులు..
X

దిశ, తల్లాడ : గురువారం నామినేషన్ కార్యక్రమానికి వెళ్తూ వివిధ దేవాలయాల్లో నామినేషన్ పత్రాలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు పూజ చేయించారు. ముందుగా తల్లాడ మండలంలోని అంజనాపురం గ్రామంలోని అభయాంజనేయ దేవాలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పెనుబల్లి మండలంలో కొలువున్న నీలాద్రినేశ్వర ఆలయంలోనీ నీలాద్రినేశ్వరని వద్ద నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సత్తుపల్లిలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని నామినేషన్ పత్రాలకు ప్రార్థన చేయించారు. ఈ కార్యక్రమంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సతీమణి మహాలక్ష్మి, మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Next Story