తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి తనిఖీలు !

by velandi.Saikiran |

రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం

తెలంగాణ సరిహద్దుల్లో అర్ధరాత్రి తనిఖీలు  !
X

దిశ, సత్తుపల్లి: రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో బుధవారం రాత్రి 11 గంటలకు సీపీ సునీల్ దత్ ఆదేశాల మేరకు కల్లూరు ఏసిపి అనిశెట్టి రఘు ఆధ్వర్యంలో గంగారం గ్రామంలో త‌నిఖీలు జ‌రిగాయి. జాతీయ రహదారిపై ఆంధ్ర ప్ర‌దేశ్‌ నుంచి వచ్చే వాహనాలను ఆపి పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టారు పోలీసులు. ఆకస్మికంగా పోలీసులు జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టడంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. ఈ వాహనాల తనిఖీలో సత్తుపల్లి పట్టణ సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, రూరల్ సీఐ ముత్తులింగం, సత్తుపల్లి డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.

Next Story