జాప్యం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వండి

by velandi.Saikiran |

విద్యార్థులకు అడ్మిషన్స్ సీజన్ నడుస్తున్న సందర్భంగా సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల

జాప్యం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వండి
X

దిశ, ఏన్కూర్: విద్యార్థులకు అడ్మిషన్స్ సీజన్ నడుస్తున్న సందర్భంగా సర్టిఫికెట్లు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల0దరికీ సకాలంలో సర్టిఫికెట్లు అందజేయాలని కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఏన్కూర్ తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన తహశీల్దార్ శేషగిరి రావుతో మాట్లాడుతూ, పెండింగ్ దరఖాస్తులు త్వరగా పూర్తిచేయాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. ప్రతి ఒక్కరు బాధ్యతతో పనిచేసి కార్యాలయానికి వచ్చే వారికి సేవలందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో జీవీఎస్, నారాయణ. డిప్యూటీ తహశీల్దార్ కిరణ్ కుమార్. రెవెన్యూ ఇన్స్పెక్టర్, శ్రీనివాసరావు. రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story