25 రోజులు కష్టపడితే వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే

by Disha Web Desk 15 |
25 రోజులు కష్టపడితే వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే
X

దిశ, ఖమ్మం : కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తలు ఇంకా 25 రోజులు కష్టపడితే వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని మాజీ ఎంపీ, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు ఎన్ని బెదిరింపులు, కేసులు నమోదు చేసినా కాంగ్రెస్ పార్టీలో భయపడే వారు ఎవరూ లేరని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి బయటకు వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు‌.

కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు గొప్పలు చెప్పిన రూపశిల్పి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అవినీతి పై దర్యాప్తు సంస్థలు నివేదికలు ఇచ్చిన కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో ప్రజలకు చెప్పాలన్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు, వరదలు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయే ప్రమాదం ఉందని నివేదికలో ఉందన్నారు. ఇంత ప్రమాదం ఉంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రేపు కాళేశ్వరం ప్రాజెక్టు తో ప్రజల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన తర్వాత స్పందిస్తారా అంటూ ప్రశ్నించారు‌. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన కేసీఆర్ అందులో బాధితులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బోర్డర్లో సైనికులుగా పని చేయాలన్నారు.

Also Read..

శంషాబాద్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తా: బీఆర్ఎస్‌కు రేవంత్ రెడ్డి మరో సవాల్

Next Story