పద్మశ్రీ అవార్డు గ్రహితను సన్మానించిన ప్రభుత్వ విప్

by Web Desk |
పద్మశ్రీ అవార్డు గ్రహితను సన్మానించిన ప్రభుత్వ విప్
X

దిశ, మణుగూరు : పద్మశ్రీ అవార్డు గ్రహిత సకిని రామచంద్రయ్యను ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అభినందించారు. 'శభాష్.. అదిరింది.. చంద్రయ్య పినపాక గడ్డకు మంచిపేరు,ప్రఖ్యాత సాధించి పెట్టావ్' అని రేగా అన్నారు. హైదరాబాద్ వెంకటాద్రి టౌన్షిప్‌లోని తన నివాసంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదివాసి ముద్దుబిడ్డ, కళాకారుడు సకిని రామచంద్రయ్యను ప్రభుత్వ విప్ రేగా అభినందించి, శాలువతో ఘనంగా సన్మానించారు. కేంద్ర ప్రభుత్వం సకిని రామచంద్రయ్య కృషి, పట్టుదల, సేవలను గుర్తించి పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.



Next Story