పట్టా భూమిలో ప్రభుత్వ భూమి బోర్డ్.. దస్త్రాలను మాయం చేస్తూ

by Web Desk |
పట్టా భూమిలో ప్రభుత్వ భూమి బోర్డ్.. దస్త్రాలను మాయం చేస్తూ
X

దిశ,మణుగూరు : పట్టా భూమిలో ప్రభుత్వ భూమి బోర్డు ఏర్పాటు చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అల్లంపల్లి అనే గ్రామంలో చోటుచేసుకుంది. పినపాక మండలం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్‌గా పని చేస్తున్న ఓ అధికారి అల్లంపల్లి అనే గ్రామంలో సర్వే నెం 80/P(X/15)గల ఒక ఎకరం పట్టా భూమిని ప్రభుత్వం భూమి అని చెప్పి బోర్డు ఏర్పాటు చేశారని ఆ భూమి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అయితే 1980 కంటే ముందు ఉండాల్సిన భూరికార్డులు లేకుండా రెవెన్యూ అధికారులే మాయం చేశారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. నిజానికి 1950 నుంచి 1980 మధ్య భూరికార్డులో సర్వే నెం 80/P(X/15)గల పట్టా భూమి మీద నమోదైన భూమిని అట్టి భూరికార్డులను లేకుండా చేయడమే కాకుండా ప్రభుత్వ భూమి కింద తెలుపుతూ ఆ పట్టా భూమిలో బోర్డు పెట్టడంతో ఇది చర్చనీయాంశంగా మారింది. పినపాక ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలను ఉల్లంఘిస్తూ అనేక భూ రికార్డులను, దస్త్రాలను అధికారులే మాయం చేస్తున్నారని, అలాగే ఫేక్ సర్టిఫికెట్లను మంజూరు చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.



Next Story

Most Viewed