అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి : మంత్రులకు ఎమ్మెల్యే రాములు నాయక్ వినతి

by Disha Web Desk 1 |
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి : మంత్రులకు ఎమ్మెల్యే రాములు నాయక్ వినతి
X

దిశ, వైరా: నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ పలువురు మంత్రులకు వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో మంగళవారం రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ లను ఎమ్మెల్యే రాములు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు రోడ్లు అభివృద్ధికి, కల్వర్టులు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రులను ఎమ్మెల్యే కోరారు.

అదేవిధంగా నిలిచిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. నిలిచిపోయిన వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రులను కోరారు. వివిధ ప్రాంతాల్లోని బ్రిడ్జిల నిర్మాణ పనులు, రోడ్ల మరమ్మతు, వివిధ గ్రామాల మధ్య ఉన్న లింకు రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా అంగన్ వాడీ పాఠశాలలను మరింత బలోపేతం చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని మంత్రికి వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయా శాఖ మంత్రులు వైరా నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యే రాములు నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్ఛం అందజేశారు.

Next Story