తుమ్మలను కలిసిన పోదెం..

by Disha Web Desk 20 |
తుమ్మలను కలిసిన పోదెం..
X

దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షుడు, భద్రాచలం ఎమ్మెల్యే పోదేం వీరయ్య సోమవారం ఉదయం దమ్మపేట మండలంలోని గండుగులపల్లి గ్రామంలోనీ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తొలిసారిగా తుమ్మల నాగేశ్వరరావు ఇంటికొచ్చిన పోదెం వీరయ్యకు తుమ్మల శాలవాతో సత్కరించారు. అనంతరం పోదెం వీరయ్య తుమ్మల నాగేశ్వరరావుకు శాలువా కపి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఇద్దరు నాయకులు తుమ్మల నాగేశ్వరరావు నివాసంలోకి ఇద్దరు నాయకులు ఏకాంతంగా అర్థగంటసేపు సుదీర్ఘంగా చర్చించారు. ఆనంతరం ఇద్దరు నాయకులు మీడియాతో మాట్లాడారు.

ముందుగా పోదాం వీరయ్య మాట్లాడుతూ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ పార్టీలోకి జిల్లా అధ్యక్షుడిగా ఆహ్వానించానని, రాబోయే రోజుల్లో నాగేశ్వరరావు నిర్ణయం ప్రకటిస్తానని తుమ్మల వ్యాఖ్యానించినట్లు పోదం వీరయ్య తెలిపారు. తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ త్వరలోనే పార్టీ మార్పు పై నిర్ణయాన్ని ప్రకటిస్తానని, కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించినందుకు వీరయ్యకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అశ్వారావుపేట నియోజికవర్గ కాంగ్రెస్ పార్టీ ఆశావాహులు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, టీపీసీసీ సభ్యురాలు పూజ, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ, దేవి ప్రసన్న, చిమిత్రాల రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed