- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాకరవాయి చేపల చెరువు వద్ద ఘర్షణ...
by Kodari Anjali |
చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురికి గాయాలైన ఘటన బుధవారం తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది.

X
దిశ, తిరుమలాయపాలెం: చేపల చెరువు విషయంలో ఇరువర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో పలువురికి గాయాలైన ఘటన బుధవారం తిరుమలాయపాలెం మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలపరిధిలోని కాకరవాయి గ్రామంలోని మద్దుల చెరువులో బుధవారం ఓ వర్గం చేపలు పడుతుండగా మరో వర్గం నిరాకరించింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి పెద్ద ఘర్షణ జరిగింది. దీంతో గతంలో చెరువులో వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేయగా, అట్టి బొమ్మల కర్రలతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంమే కాకా రాళ్లు సైతం రువ్వుకున్నారు. ఈ దాడిలో ఇరువర్గాల పురుషులతో పాటు, మహిళలు సైతం గాయపడ్డారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘర్షణ స్థలానికి చేరుకొని శాంతి భద్రతలు కాపాడారు. ఈ ఘర్షణ పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






