పేద ప్రజలపై భారాలు...కార్పొరేట్లకు వరాలా : తమ్మినేని

by Disha Web Desk 15 |
పేద ప్రజలపై భారాలు...కార్పొరేట్లకు వరాలా :  తమ్మినేని
X

దిశ, జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో సీపీఎం జన చైతన్య యాత్రకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల కేంద్రంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ మతోన్మాద బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వంలో అధికారంలోకి తీసుకురావద్దని జన చైతన్య యాత్రను ప్రారంభించినట్లు చెప్పారు. దేశంలో కార్పొరేట్లకు వత్తాసు పలుకుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అలాంటి ప్రభుత్వాన్ని తెలంగాణలో అడుగుపెట్టనివ్వొద్దని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నందునే ఆ పార్టీకి మద్దతు తెలుపుతున్నామన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఎవరున్నా వారికి తమ మద్దతు ఉంటుందన్నారు. పొత్తుల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ విషయమై చర్చిస్తున్నామని స్పష్టం చేశారు. తప్పు చేస్తే ఎవరినైనా ఈడి ప్రశ్నించవచ్చని, అదాని, జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్లను ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పోతినేని సుదర్శన్, వెంకటేశ్వరరావు, భూక్య వీరభద్రం, కాసాని ఐలయ్య, చందర్రావు, వ్యాస నరేష్, చీమలపాటీ భిక్షం తదితరులు పాల్గొన్నారు.

Next Story