Bhatti Vikramarka:రూ.26 కోట్లతో రోడ్డు పనులు

by Sridhar Babu |

రావినూతల నుంచి పొద్దుటూరు వరకు రోడ్లు, భవనాల శాఖచే 11 కిలోమీటర్ల రహదారి విస్తరణ, పటిష్ట పనులు రూ.26 కోట్లతో చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)అన్నారు.

Bhatti Vikramarka:రూ.26 కోట్లతో రోడ్డు పనులు
X

దిశ, బోనకల్ : రావినూతల నుంచి పొద్దుటూరు వరకు రోడ్లు, భవనాల శాఖచే 11 కిలోమీటర్ల రహదారి విస్తరణ, పటిష్ట పనులు రూ.26 కోట్లతో చేపడుతున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Deputy Chief Minister Mallu Bhatti Vikramarka)అన్నారు. మంగళవారం ఆయన బోనకల్ మండలం రావినూతల గ్రామంలో పర్యటించి రూ.26 కోట్ల అంచనా వ్యయంతో రావినూతల నుండి ప్రొద్దుటూరు వరకు (From Ravinoothala to Proddatur)విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనకల్ మండలంలో అభివృద్ది పనులు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. రావినూతల నుంచి పొద్దుటూరు వరకు రూ.26 కోట్లతో చేపట్టిన రెండు లైన్ల రోడ్డు విస్తరణ, పటిష్ట పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్ గౌడ్, బోనకల్ తహసీల్దార్ ఏ. పున్నంచందర్, ఎంపీడీఓ శ్రీదేవి, ఆర్ అండ్ బీ ఈఈ తానేశ్వర్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story