15 గంటల పాటు భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్

by velandi.Saikiran |   (  Updated:2025-08-30 13:04:40  IST  )

భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్ కానున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో 15 గంటలు పా

15 గంటల పాటు భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్
X

దిశ, భద్రాచలం: భద్రాచలం రామాలయం దర్శనాలు బంద్ కానున్నాయి. భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి దేవస్థానంలో 15 గంటలు పాటు దర్శనాలు నిలిపివేయనున్నారు. సెప్టెంబర్ 7 న పాక్షిక చంద్ర గ్రహణం పురస్కరించుకొని ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుండి మరుసటి రోజు తెల్లవారు జాము 3 గంటల వరకూ రామాలయం తలుపులు మూసివేయనున్నారు. 8వ తేది తెల్లవారు జాము 3 గంటలకు సుప్రభాతం, ఆలయ శుద్ధి, సంప్రోక్షణ, ఆరాధన, సేవాకాలం, నివేదన తర్వాత ఉదయం 7.30 గంటల నుండి స్వామి వారి దర్శనాలు ప్రారంభం అవుతాయని ఆలయ ఈ ఓ దామోదర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

Next Story