- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్…12 మంది మావోయిస్టులు మృతి
by Disha Web Desk 11 |
X
దిశ, భద్రాచలం : ఛతిస్గడ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, గంగలోర్ పిఎస్ పరిధిలోని పిడియా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. పిడియా అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్ర నేతలు సమావేశం అయ్యారనే ఖచ్చితమైన సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా ఇరు వర్గాలకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12మంది మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లు గాయపడినట్లు చతిస్గడ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిసింది. మృతి చెందిన మావోయిస్టులలో పార్టీ అగ్రనేతలు ఉన్నట్లుగా సమాచారం. సంఘటనా ప్రాంతంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
Next Story