- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొత్త రేషన్ కార్డుల జారీపై CM రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో ప్రభుత్వ పథకాలు పొందడానికి రేషన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే రేషన్ కార్డునే ఎందుకు కొలమానంగా చూస్తున్నారో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిస్సహాయులు ఎవరనేది నిర్ణయించడానికి ఏదైనా కొలమానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఏ కొలమానం లేకుండా పథకాలు వర్తింపజేస్తే నిధులు దుర్వినియోగం అవుతాయని అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో పథకాల అమలులో నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగం రెండూ జరిగాయని వెల్లడించారు. ఏకంగా హైవే రోడ్లకు కూడా రైతుబంధు నిధులు మంజూరు అయ్యాయంటే ఏ రేంజ్లో అవినీతి జరిగిందో ఆలోచించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
అసలైన పేదలకు సంక్షేమ పథకాలు అందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని.. అందుకే రేషన్ కార్డు నిబంధన పెట్టామని చెప్పారు. లబ్ధిదారుల గుర్తింపు నిరంతరం జరుగుతుందని హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డులు జారీ చేసి నిరంతరం కొత్త లబ్ధిదారులను చేరుస్తామని మాటిచ్చారు. రేషన్ కార్డు నిబంధన లేకపోతే కోటీశ్వరులు కూడా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటారని సరదాగా చెప్పారు. కొన్నే్ళ్లుగా వర్షాలు బాగా పడ్డాయని.. అందుకే భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ఈ సారి వర్షాలు చాలా తక్కువగా పడటం మూలంగానే భూగర్భ జలాలు తగ్గాయని తెలిపారు. ఇప్పుడీ భూగర్భ జలాలను కేసీఆర్ పెంచుతాడా? అని ప్రశ్నంచారు. రాష్ట్రంలో బోర్ల సంఖ్య పెరగడం వల్లే వరి ఉత్పత్తి పెరిగిందని.. కాళేశ్వరం వల్ల కాదని స్పష్టం చేశారు.