హైదరాబాద్‌లో ‘The Kerala Story’ సీన్ రిపీట్.. తన కూతురు ఆచూకీ చెప్పాలంటూ..

by Disha Web Desk 4 |
హైదరాబాద్‌లో ‘The Kerala Story’ సీన్ రిపీట్.. తన కూతురు ఆచూకీ చెప్పాలంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త లేకున్నా అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఆచూకీ చెప్పాలంటూ తల్లి తల్లడిల్లింది. కూమార్తె తాను మేజర్ నని ఇష్టమొచ్చిన చోట ఉంటానని చెప్పడంతో తల్లి తీవ్ర మనోవేదనకు గురవుతోంది. ఈ ఘటనకు సంబంధించి తల్లి సుమన్ జాదవ్ మీడియాతో మాట్లాడారు. భర్త చనిపోవడంతో చిన్న టిఫిన్ బండి పెట్టుకుని ఇద్దరు కుమారులు, కూతురిని పోషించుకుంటున్నానని తెలిపింది. కాగా కూతురు సోని జాదవ్ (21) ఎంబీఏ పూర్తి చేసిందని పేర్కొంది. టెన్త్ క్లాస్ వరకు కార్వాన్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో చదివే సమయంలో అమ్రన్ బేగం అనే మరో యువతితో పరిచయం ఏర్పడిందని తెలిపింది.

గత నెల 7న అమ్రన్ తన కూతురు సోని జాదవ్‌ను తన టూవీలర్‌పై తీసుకెళ్లిందన్నారు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో పీఎస్‌లో కంప్లైంట్ ఇచ్చానన్నారు. అప్పటి వరకు తన కూతురు జాడ తెలియదని చెప్పిన అమ్రన్ బేగం తన కూతురు సోనిని, న్యాయవాదులను పీఎస్‌కు తీసుకువచ్చిందన్నారు. కూతురికి ఎంత సర్ధి చెప్పినా వినకుండా మళ్లీ కనిపించకుండా పోయిందన్నారు. తన కూతురికి రెండు నెలల ముందే పాస్ పోర్ట్ తీయించినట్లు తెలిసిందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే చొరవ చూపి తన కూతురుని వెతికి తమకు అప్పగించాలని కోరింది.

Next Story

Most Viewed