కేసీఆర్ రేపటి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదే.. ఆ జిల్లాలో ప్రెస్ మీట్

by Disha Web Desk 13 |
కేసీఆర్ రేపటి జిల్లాల పర్యటన షెడ్యూల్ ఇదే.. ఆ జిల్లాలో ప్రెస్ మీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో:బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రేపు జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో నీరు అందక ఎండిపోతున్న పంట పొలాలను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడనున్నారు. ఈ మేరకు కేసీఆర్ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ విడుదలైంది. ఆదివారం ఉదయం 8:30 గంటలకు కేసీఆర్ ఎర్రవెల్లిలోను ఫామ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. ఉదయం 10:30 లకు జనగామ జిల్లా ధరావత్ తండాకు చేరుకుని అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం 11:30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి ఎండిన పంటలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటలకు అక్కడే లంచ్ చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి నల్గొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి బయలుదేరి రాత్రి 9 గంటలకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకుంటారు.

Next Story