బ్రేకింగ్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్

by Disha Web Desk 19 |
బ్రేకింగ్: స్వప్నలోక్ కాంప్లెక్స్‌ మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణ నష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించివారికి రూ.3 లక్షల ఎక్స్ గ్రేషియాను కేసీఆర్ ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసానిచ్చారు. క్షేత్రస్థాయిలో ఉండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు సీఎం కేసీఆర్ సూచించారు.



Next Story