బ్రేకింగ్: స్పీకర్ పోచారం నియోజకవర్గానికి కేసీఆర్ వరాల జల్లు

by Disha Web Desk |
బ్రేకింగ్: స్పీకర్ పోచారం నియోజకవర్గానికి కేసీఆర్ వరాల జల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లాలోని తిమ్మాపూర్‌లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో గల వేంకటేశ్వర్ స్వామి కల్యాణంలో సీఎం దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి కల్యాణంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మరో రూ.7 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా స్పీకర్ పోచారం ప్రాతినిధ్యం వహిస్తోన్న బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 50 కోట్లు నిధులు కేటాయించారు.

Next Story