నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. ఈడీ నెక్ట్స్ స్టెప్ ఇదే..!

by Disha Web Desk 4 |
నేటితో ముగియనున్న కవిత కస్టడీ.. ఈడీ నెక్ట్స్ స్టెప్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కవితను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈడీ కవితను హాజరుపరచనుంది. కవితను మరో 3 రోజుల కస్టడీకి ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. మద్యం కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఇప్పటి ఈడీ కస్టడీకి తీసుకుంది. కేజ్రీవాల్, కవితను ఒకే సారి ప్రశ్నించే యోచనలో ఈడీ అధికారులు ఉన్నారు. ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు కవిత కస్టడీ పొడిగింపును ఈడీ కోరనుంది. మరో లిక్కర్ కేసులో కవిత బంధువుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.


Next Story

Most Viewed