రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య రూ.25 కోట్ల డీల్: కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

by Disha Web Desk 19 |
రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ మధ్య రూ.25 కోట్ల డీల్: కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరు ఒక్కటేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఈటల డబ్బులిచ్చాడని తాను గతంలో చెప్పినప్పుడు స్పందించని రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఈటల వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యి.. తన వ్యాఖ్యలపై మాత్రం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.

వేం నరేందర్ కొడుకు పెళ్లిలో హుజురాబాద్ ఉప ఎన్నిక డీల్ కుదుర్చుకున్నారని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. లెజెండ్స్ రెస్టారెంట్‌లో రూ.25 కోట్లు డబ్బు చేతులు మారాయని ఆరోపించారు. దీనిపై ఇల్లంతకుంట రాముడి సాక్షిగా ప్రమాణం చేద్దాం అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, ఈటల మధ్య తేడా రావడంతో ఈ విషయం బయటపడిందన్నారు. బీజేపీ నేతల మధ్య అంతర్గత కలహాలున్నాయని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ బ్రోకర్ల కమిటీ చైర్మన్ అని కౌశిక్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.


Next Story

Most Viewed