భార్య కాపురానికి రావడం లేదని.. ఎలుకల మందు తాగిన భర్త

by velandi.Saikiran |

భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్

భార్య కాపురానికి రావడం లేదని.. ఎలుకల మందు తాగిన భర్త
X

దిశ, తంగళ్లపల్లి: భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపనతో ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ (35) అనే వ్యక్తికి భార్య పద్మ, కూతురు, కొడుకు ఉన్నారు. అయితే కుటుంబ తగాదాల కారణంగా భార్య పద్మ గత నాలుగు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటోంది. దింతో తన భార్య కాపురానికి రావడం లేదని మానసిక వేదనతో ఉంటున్న కరుణాకర్... మంగళవారం ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Next Story