తంగళ్లపల్లిలో అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య

by Bhanu |

తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది.

తంగళ్లపల్లిలో అనారోగ్యంతో వివాహిత ఆత్మహత్య
X

దిశ, తంగళ్లపల్లి : తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కడారి జ్యోతి (38) అనారోగ్యంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. జ్యోతి భర్త మల్లారెడ్డితో కలిసి సంతానం లేకపోవడంతో ఓ ఆరేళ్ల బాలికను దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. అయితే గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జ్యోతి తీవ్ర నిరాశలో జీవితం ముగించుకుంది. ఆమె అకాలమరణంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Next Story