గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య

by Elthuri vijay kumar |

అదిలాబాద్ జిల్లా తిర్యాని గ్రామానికి చెందిన మహిళగా గుర్తింపు

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య
X

గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య

- అదిలాబాద్ జిల్లా తిర్యాని గ్రామానికి చెందిన మహిళగా గుర్తింపు

దిశ, వెల్గటూర్ : ధర్మపురి నియోజక వర్గంలోని రాయ పట్నం వంతెన పై నుంచి ఓ మహిళ మంగళవారం దూకి ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది. అదిలాబాద్ జిల్లా తీర్యాని గ్రామానికీ చెందిన మహిళ మధ్యాహ్న సమయంలో కొద్ది సేపు వంతెనపై తచ్చా డింది. అనంతరం తన వద్ద గల హ్యాండ్ బ్యాగ్, చెప్పులను వంతెనపై వదిలేసి గోదావరిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. గోదావరిలో మృతదేహం పైకి తేలగా దండేపల్లి పోలీసుల ఆధ్వర్యంలో బయటకు తీయడానికి రెస్క్యూ చేస్తున్నారు. అయితే మహిళ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story