పట్టుబడినవి పీడీఎస్ బియ్యమే.. : వసంతరావు

by Disha Web Desk 23 |
పట్టుబడినవి పీడీఎస్ బియ్యమే.. :  వసంతరావు
X

దిశ,హుజురాబాద్ రూరల్: ఈ నెల 10 న హుజురాబాద్ పట్టణ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్ లో పట్టుబడిన బియ్యం పీడీఎస్ బియ్యమేనని సివిల్ సప్లై డీటీ వసంతరావు తెలిపారు. పరకాల నుంచి రాజస్థాన్ వెళుతుండగా అనుమానించి హుజురాబాద్ పట్టణ సమీపంలోని పరకాల క్రాస్ రోడ్ చెక్ పోస్ట్ వద్ద 350 క్వింటాళ్ల బియ్యం లోడ్ తో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం పీడీఎస్ వి గా అనుమానించి పరీక్షల కోసం బియ్యం శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించారు.ల్యాబ్ పరీక్షల్లో పీడీఎస్ బియ్యం గా తేలింది. బియ్యాన్ని సీజ్ చేసి గోదాంకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సివిల్ సప్లై డీటీ లు వసంతరావు, వినోద్ లు తెలిపారు.

Next Story

Most Viewed