ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి: ఎస్పీ భాస్కర్

by Disha Web Desk 1 |
ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలి: ఎస్పీ భాస్కర్
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: ఠాణాకు వచ్చే బాధితులతో మర్యాదగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ ఎగ్గిడి భాస్కర్ పోలీస్ సిబ్బందికి సూచించారు. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ను సోమవారం అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఎంత మంది సిబ్బంది ఉన్నారు, వారంతా ఎలాంటి విధులు నిర్వహిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి రోజు ఎన్ని బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ విధులు నిర్వహిస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు.

అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కడెక్కడ ఎన్ని బీట్స్ నడుస్తున్నాయని తెలుసుకొని ప్రాపర్ గా పెట్రోలింగ్ నిర్వహిస్తూ దొంగతనాలు జరగకుండా చూసుకోవాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. డయల్ 100 కాల్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సమస్య పరిష్కరించాలని, బ్లూకోల్ట్స్, పెట్రోల్ కార్ నిరంతరం గస్తీ నిర్వహించాలని, సిబ్బంది తమకు కేటాయించిన కాలనీల పూర్తి సమాచారం సిబ్బంది అందరి దగ్గర ఉండాలని, ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో వుంటూ ప్రజల సమస్యలను తీర్చాలన్నారు.

ప్రజా ఫిర్యాదులలో ఎటువంటి జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలని సూచించారు. జగిత్యాల పట్టణ పరిధిలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బంది అందరి కృషి చేయాలని సిబ్బంది, అధికారులు అందరూ విధులు సక్రమంగా నిర్వహించడం ద్వారానే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని సూచించారు. పట్టణ పరిసరాలు ఎలాంటి సంఘటనలు జరిగినా పై అధికారులకు తక్షణమే తెలియజేయాలని సూచించారు. పట్టణ పరిధిలో ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం జరగకుండా చూసుకోవాలని ట్రాఫిక్ సిబ్బందికి సూచించారు.

అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్, ఇతర జంక్షన్ల దగ్గర లైన్స్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రస్తుత రోజుల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. అందుకే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ మరియు పట్టణ సిబ్బంది అందరూ డ్రంక్ అండ్ డ్రైవ్ చేసే వారిపై పై ఎక్కువ దృష్టి సారించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని సూచించారు.అయన వెంట డీఎస్పీ ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ రామచందర్ రావు, ఎస్సైలు రహీం, సందీప్, ట్రాఫిక్ ఎస్ఐ రాము, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story