- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

దిశ, రుద్రంగి: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో డిసిఎంఎస్ ఆధ్వర్యంలో గురువారం వరి, మక్కలు కొనుగోలు కేంద్రాన్ని అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి పట్టెడు అన్నం పెట్టే రైతన్నే అని అలాంటి రైతు అన్నలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది అని అన్నారు. రైతన్నలు పండించిన వరి పంటకు ఏ రకం ధాన్యానికి 2389 మక్కలకు 2400 కనీస మద్దతు ధర లభిస్తుందని అన్నారు.
ఆనాడు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కొనసాగతున్నాయని అన్నారు.రైతులు పండంచిన పంటను చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని అధికారులు అధిశగా చర్యలు తీసుకోవాలి కోరారు. ఎవరు కూడా దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని అన్నారు.కొనుగోలు లో గాని కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది కలిగిన అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చెర్మన్ చేలుకల తిరుపతి,బీసీ సెల్ అధ్యక్షుడు గండి నారాయణ, మండల వ్యవసాయ అధికారి ప్రియదర్శిని, గడ్డం స్వామి,మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయకులు ఎర్రం గంగానర్సయ్య,పల్లి గంగాధర్,అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.






