రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి..

by Bhanu |

స్క్యూటీ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి..
X

దిశ, హుజురాబాద్ రూరల్ : స్క్యూటీ పై రోడ్డు క్రాస్ చేస్తుండగా లారీ ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... హుజురాబాద్ పట్టణంలో బుధవారం సాయంత్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద కరీంనగర్ నుండి వరంగల్ వెళుతూ స్కూటీపై (ts 02ey1634)రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని లారీ ఢీ కొట్టింది. అతడు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 35 సంవత్సరాల వరకు ఉంటుంది. చౌరస్తాలో కొద్దిసేపు ట్రాఫిక్కు స్తంభించింది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story