ఒంటరితనం తాళలేక వృద్దుడి ఆత్మహత్య

by velandi.Saikiran |

చందుర్తికి చెందిన పళ్ళ లస్మయ్య (80) అనే వృద్దుడు... శివారుల్లోని ఓ గుడిసెలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కే

ఒంటరితనం తాళలేక వృద్దుడి ఆత్మహత్య
X

దిశ, చందుర్తి : చందుర్తికి చెందిన పళ్ళ లస్మయ్య (80) అనే వృద్దుడు... శివారుల్లోని ఓ గుడిసెలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండల కేంద్రానికి చెందిన లాస్మయ్య భార్య గత కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయింది. అప్పటి నుండి ఒంటరిగా ఉంటున్న లస్మయ్య, గత కొంత కాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. దింతో మర్రి రాజు అనే రైతు పొలం వద్ద గుడిసె లో ఉరి వేసుకున్నాడు లస్మయ్య. ఇక మృతుడి కుమారుడు పళ్ళ శంకర్ (55) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జె. రమేష్ తెలిపారు.

Next Story