రెండు లారీల రేషన్ బియ్యం సీజ్

by Disha Web Desk 1 |
రెండు లారీల రేషన్ బియ్యం సీజ్
X

దిశ, సుల్తానాబాద్: గత నెల మార్చి 31న రెండు లారీల రేషన్ బియ్యం అదృశ్యం అవడంతో పెద్దపెల్లి డీఎస్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎం.ఎల్.ఎస్ రేషన్ బియ్యం లారీలు అదృశ్యమైంది. ఇందులో పని చేస్తున్న గోదాం ఇంచార్జ్ వెంకట్రాజం డాటా ఎంట్రీ ఆపరేటర్ శ్రీనివాసరెడ్డి కదంబాపూర్ రేషన్ డీలర్ కొమ్ము ఓదెలు ముగ్గురు కలిసి రెండు లారీలను పక్కదోవ పట్టించి అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. సుల్తానాబాద్ శివారులోని రైస్ మిల్ దగ్గర ఆ రెండు లారీలను అధికారుల పట్టుకున్నారు. ఆ రెండు లారీల్లోని 472.50 క్వింటాళ్ల బియ్యం, లారీని కూడా సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సుల్తానాబాద్ సీఐ విలేకరుల సమావేశంలో తెలిపారు.

Next Story

Most Viewed